News April 1, 2026

68 శాతం మహిళలే..!

image

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1.95 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని DPTO వై.ఎస్.ఎన్ మూర్తి బుధవారం తెలిపారు. తూ.గో జిల్లాలోని 4 డిపోల నుంచి మొత్తం 2.89 కోట్ల మంది ప్రయాణించగా.. అందులో 68 శాతం మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. పథకం అమలులోకి వచ్చి 225 రోజులు పూర్తయిందని, మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.

Similar News

News April 7, 2026

పులి భయం వీడింది.. పర్యాటకం మెరిసింది!

image

కాకినాడ, తూర్పు, పోలవరం జిల్లాల్లో పది రోజులుగా వణికిస్తున్న పులి సంచారం తగ్గడంతో పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది. పులి పాపికొండలు అభయారణ్యం వైపు వెళ్లడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. పాపికొండలు విహారయాత్రకు, పోశమ్మగండికి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ముంపు ప్రాంతాల గిరిజనులు జీడిపిక్కల సేకరణకు బయటకు వస్తుండగా.. అటవీశాఖ పర్యవేక్షణ కొనసాగుతోంది.

News April 7, 2026

రాజమండ్రి: ఏప్రిల్ 7న జాబ్ మేళా

image

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ సోమవారం తెలిపారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన 19-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. అర్హత గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News April 6, 2026

రాజమండ్రి: ఏప్రిల్ 7న జాబ్ మేళా

image

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ సోమవారం తెలిపారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన 19-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. అర్హత గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.