News April 3, 2026

తూర్పుగోదావరి జిల్లాకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

image

రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(PHC/UPHC) సేవలలో తూ.గో. జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు DMHO కె.వెంకటేశ్వరరావు ప్రకటించారు. శుక్రవారం బొమ్మూరులోని కార్యాలయం వద్ద సిబ్బందితో కలిసి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సానుకూల అభిప్రాయం ఫిబ్రవరిలో 74.8\% ఉండగా, మార్చిలో అది 77.8%కి పెరిగిందని ఆయన తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన కొనియాడారు.

Similar News

News April 5, 2026

కొవ్వూరు: కరెంటు షాక్‌తో రైతు మృతి

image

విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన ఘటన కొవ్వూరులో జరిగింది. కొవ్వూరు హైవే రోడ్డు పక్కన ఉన్న పంటపొలాల్లో విగతజీవిగా పడి ఉన్న వ్యక్తిని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పొలంలో కరెంటు తీగలు తెగిపడడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మృతుడు పసివేదల గ్రామానికి చెందిన కౌలు రైతు శ్రీను(60)గా గుర్తించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీసు కేసు నమోదైంది.

News April 5, 2026

దండంగి కొండలపై పులి సంచారం

image

పోలవరం జిల్లా దండంగి కొండలపై పులి సంచారాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున వరకు అందిన సిగ్నల్స్ ఆధారంగా పులి ఆచూకీ లభ్యమైంది. ఇప్పటివరకు పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పులి 550 కి.మీ. ప్రయాణించినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. ప్రస్తుతం రంపచోడవరం వైపు వెళ్లే అవకాశం ఉండటంతో ఏజెన్సీ గ్రామస్థులను అధికారులు అప్రమత్తం చేశారు.

News April 5, 2026

ఏప్రిల్ 6న యథావిధిగా పీజీఆర్ఎస్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఏప్రిల్ 6న యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.