News May 9, 2024

విశాఖ: కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా శశిథరూర్ ప్రచారం

image

ఏఐసీసీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ నగరంలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. శుక్రవారం ఆయన పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు విశాఖ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

Similar News

News October 24, 2025

ఈవీఎం గోదాముల‌ను త‌నిఖీ చేసిన విశాఖ క‌లెక్ట‌ర్

image

చిన‌గ‌దిలిలో ఈవీఎం గోదాముల‌ను కలెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ త‌నిఖీ చేశారు. నెలవారీ త‌నిఖీల్లో భాగంగా శుక్రవారం ఉద‌యం గోదాముల‌ను సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. సీసీ కెమెరాల ప‌నితీరును, ప్ర‌ధాన ద్వారానికి ఉన్న సీళ్ల‌ను ప‌రిశీలించారు. భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై అక్క‌డ అధికారులకు, భ‌ద్ర‌తా సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు.

News October 24, 2025

‘ది డెక్’ భవనంలో జార్జియా యూనివర్సిటీ అద్దె ఒప్పందం రద్దు

image

సిరిపురంలోని ‘ది డెక్’ భవనంలో జార్జియా యూనివర్సిటీ అద్దె ఒప్పందాన్ని వీఎంఆర్డీఏ రద్దు చేసింది. నిర్దిష్ట సమయంలో డిపాజిట్ చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందం కుదిరిన 15 రోజుల్లోపు అడ్వాన్స్ డిపాజిట్ చెల్లించాలి. మూడు నెలలు గడిచినా డిపాజిట్ చెల్లించకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో మూడో ఫ్లోర్ ఖాళీగా ఉంది. దీనికోసం మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.

News October 24, 2025

‘కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు భర్తీ కావాలి’

image

కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సూపరింటెండెంట్ ఐ.వాణిని గురువారం కోరారు. 34 హెడ్ నర్సులు, 43 కాంట్రాక్ట్ నర్సులు, ట్రామా కేర్‌లో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. సిబ్బంది పనిభారం అధికమై రోగుల సేవలో నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.