News April 5, 2026
రేపు శ్రీ షిర్డీ సాయిలో మెగా స్కాలర్షిప్ టెస్ట్

10వ తరగతి విద్యార్థుల కోసం శ్రీ షిర్డీ సాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు, స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు. దివాన్ చెరువు బీజాపురి క్యాంపస్లో ఉ. 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. JEE, NEET, సివిల్స్పై నిపుణులు అవగాహన కల్పిస్తారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్షిప్స్ అందజేస్తామని ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ పేర్కొన్నారు.
Similar News
News April 5, 2026
తిరుపతి: దరఖాస్తుల గడువు పొడిగింపు

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2026 సంవత్సరానికి Ph.D/ M.S(Research) ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/admissions వెబ్ సైట్ చూడాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 13.
News April 5, 2026
మాడుగుల: ఒకే బైక్పై ఐదుగురు.. యాక్సిడెంట్తో తీవ్ర గాయాలు

మాడుగుల మండలం ఎం.కోటపాడు జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు గాయపడ్డారు. పరిమితికి మించి ఒకే బైక్ మీద ఐదుగురు యువకులు కాశీపురం నుంచి ఎం.కోటపాడు వస్తూ నిలిపి ఉన్న బొలెరోని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉందని,108లో ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
News April 5, 2026
ధురంధర్-2ను వీక్షించిన పాక్ మాజీ ప్రధాని?

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ధురంధర్-2 సినిమా కాపీని తెప్పించుకొని వీక్షించినట్లు ఆ దేశానికి చెందిన జర్నలిస్టు ఖలీద్ వెల్లడించారు. అందులో తన పాత్రను తీర్చిదిద్దిన విధానాన్ని ఆయన మెచ్చుకున్నట్లు తెలిపారు. పాక్లో ఈ చిత్రంపై నిషేధం విధించినప్పటికీ తాను తొలి రోజే చూసినట్లు ఖలీద్ గతంలో చెప్పారు. కాగా ధురందర్-2లో నవాజ్ పాత్రను మషూర్ అమ్రోహి పోషించారు. క్యాస్టింగ్ పర్ఫెక్ట్గా సెట్టవడం విశేషం.


