News May 10, 2024
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి: బాలాజీ

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు విలువైనదని గుర్తించి గ్రామస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీ గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరిస్తామన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అప్రమత్తమై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి గురువారం గ్రామస్తులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.
Similar News
News July 10, 2025
కృష్ణా: గుర్తింపు లేని పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు

ఆరు సంవత్సరాలుగా ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలజీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధంగా నమోదై, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని ఈ పార్టీలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు.
News July 10, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞కృష్ణా: రేపే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
☞ గుడివాడ ఫ్లైఓవర్ పనులు వేగవంతం
☞ వీరవల్లి: మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
☞ మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
☞ కృష్ణా: పీఏసీఎస్లకు త్రిసభ్య కమిటీలు
☞ మచిలీపట్నం: మైనర్ల తల్లిదండ్రులకు డీఎస్పీ రాజా హెచ్చరికలు
☞ కనకదుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న శాఖాంబరి ఉత్సవాలు
News July 9, 2025
వీరవల్లి: మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.