News April 5, 2026

దండంగి కొండలపై పులి సంచారం

image

పోలవరం జిల్లా దండంగి కొండలపై పులి సంచారాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున వరకు అందిన సిగ్నల్స్ ఆధారంగా పులి ఆచూకీ లభ్యమైంది. ఇప్పటివరకు పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పులి 550 కి.మీ. ప్రయాణించినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. ప్రస్తుతం రంపచోడవరం వైపు వెళ్లే అవకాశం ఉండటంతో ఏజెన్సీ గ్రామస్థులను అధికారులు అప్రమత్తం చేశారు.

Similar News

News April 7, 2026

పులి భయం వీడింది.. పర్యాటకం మెరిసింది!

image

కాకినాడ, తూర్పు, పోలవరం జిల్లాల్లో పది రోజులుగా వణికిస్తున్న పులి సంచారం తగ్గడంతో పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది. పులి పాపికొండలు అభయారణ్యం వైపు వెళ్లడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. పాపికొండలు విహారయాత్రకు, పోశమ్మగండికి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ముంపు ప్రాంతాల గిరిజనులు జీడిపిక్కల సేకరణకు బయటకు వస్తుండగా.. అటవీశాఖ పర్యవేక్షణ కొనసాగుతోంది.

News April 7, 2026

రాజమండ్రి: ఏప్రిల్ 7న జాబ్ మేళా

image

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ సోమవారం తెలిపారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన 19-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. అర్హత గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News April 6, 2026

రాజమండ్రి: ఏప్రిల్ 7న జాబ్ మేళా

image

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ సోమవారం తెలిపారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన 19-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. అర్హత గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.