News May 10, 2024

VZM: ‘ఎంసీసీ నిఘా బృందాలు చురుకుగా పని చేయాలి’

image

 ఎంసీసీ నిఘా బృందాలైన ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీలు, ఎక్స్పెండిచర్ బృందాలు వాహనాల తనిఖీలలో, నగదు, మద్యం, వస్తువుల పంపిణీలపై దృష్టి పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. రానున్న మూడు రోజుల్లో చురుకుగా పని చేయాలన్నారు. ఎంసీసీ బృందాలు పక్షపాత రహితంగా పని చేయాలనీ సూచించారు. గురువారం కలెక్టర్ నాగలక్ష్మి వెబెక్స్ ద్వారా సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.

Similar News

News September 27, 2025

విచారణ వేగవంతానికి ఈ-సమన్స్ అమలు చేయాలి: VZM SP

image

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో పని చేస్తున్న అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్
అధికారులు, హెచ్సీలతో SP దామోదర్ శనివారం జూమ్ మీటింగు నిర్వహించారు. నమోదైన కేసుల్లో నిందితులకు న్యాయ స్థానాల్లో శిక్షపడేలా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్ సిబ్బంది పాత్ర క్రియాశీలకమన్నారు. కేసుల విచారణ మరింత వేగవంతంగా జరిపించేందుకు ఈ-సమన్స్ అమలు చేయాలన్నారు.

News September 27, 2025

వర్షాలను దృష్టిలో ఉంచుకొని పండగ ఏర్పాట్లు: RDO

image

వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పైడితల్లి పండగ ఏర్పాట్లను చేసుకోవాలని RDO దాట్ల కీర్తి తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. గుడి లోపల దేవస్థానం సిబ్బంది ఎక్కువ మంది ఉండడంతో భక్తుల తోపులాట జరుగుతోందన్నారు.

News September 27, 2025

VZM: రేపటి నుంచి అఖిల‌భార‌త డ్వాక్రా బ‌జార్‌

image

దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ స్వ‌యం స‌హాయ‌క సంఘాలు రూపొందించే ఉత్పత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌కు అఖిల భార‌త డ్వాక్రా బ‌జార్ గొప్ప వేదిక‌గా నిలవ‌నుంద‌ని క‌లెక్ట‌ర్ రామ సుంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. త‌న ఛాంబ‌ర్‌లో మీడియాతో శ‌నివారం మాట్లాడారు. ఆదివారం నుంచి మ‌నంద‌రికీ అందుబాటులో విజ‌య‌న‌గ‌రంలో ప్రారంభంకానున్న ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌జ‌లంతా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.