News May 10, 2024

HYD: BIG ALERT: 48 గంటలు నిషేధం

image

ఈ నెల 13న MP ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా రేపు సాయంత్రం 6.00 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.00 గంటల వరకు అభ్యంతరకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ SMSలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని గుర్తు చేశారు.SHARE IT

Similar News

News September 13, 2025

కూకట్‌పల్లి: రేణు అగర్వాల్‌ను చంపింది వీళ్లే..!

image

HYD కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్(50)ను ఇటీవల <<17699611>>దారుణంగా హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. యువకులు డబ్బు, నగల కోసం యజమానురాలిని తాళ్లతో కట్టేసి, గొంతులో కత్తితో పొడిచి, ప్రెషర్ కుక్కర్‌తో తలపై కొట్టి చంపేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించగా ఇప్పుడు జైలులో కటకటాలను లెక్కిస్తున్నారు.

News September 13, 2025

ఉప్పల్ శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

image

HYD ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కూచిపూడి నాట్య గురువు రమేశ్ రాజ్ శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. మూషిక వాహన, అదివో అల్లదిగో, రామాయణ శబ్దం, కృష్ణం కలయసఖి, గోవిందా గోవిందా, అయిగిరి నందిని వంటి అంశాలను సిరిశ్రీ, కీర్తన, చైత్ర, ప్రణుతి, బిందుశ్రీ, వర్షిణి, చైతన్య, జయంత్ తదితరులు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

News September 13, 2025

శామీర్‌పేట్ నల్సార్‌ యూనివర్సీటీలో గవర్నర్

image

HYD శామీర్‌పేట్‌లోని నల్సార్‌ యూనివర్సిటీలో రెండు రోజులుగా జరిగిన కార్పొరేట్ గవర్నెన్స్ సదస్సు శనివారం ముగిసింది. ICSI, నల్సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక, గిరిజన సమాజాలు ప్రకృతి వనరులను వస్తువులుగా చూడవని, ప్రకృతితో సామరస్యంగా జీవిస్తాయని గవర్నర్ తెలిపారు.