News May 10, 2024

వీరఘట్టంలో హైపర్ ఆది ఎన్నికల ప్రచారం

image

స్థానిక నియోజకవర్గ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు మద్దతుగా జబర్దస్త్‌ నటుడు హైపర్‌ ఆది పట్టణంలో గురువారం ప్రచారం నిర్వహించారు. తొలుత స్థానిక కోటదుర్గమ్మ ఆలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 7 సార్లు కరెంటు ఛార్జీలు, 3 సార్లు బస్సు ఛార్జీలు పెరిగాయన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని కోరారు.

Similar News

News December 31, 2025

9 మందికి రూ.18 లక్షల పింఛన్లు అందజేసిన మంత్రి అచ్చెన్న

image

గత ప్రభుత్వం హయాంలో ఆగిన 9 మందికి రూ.18 లక్షల పింఛన్లను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం కోటబొమ్మాళిలో అందించారు. నందిగామ మండలం దీనబంధుపురం గ్రామానికి చెందిన వీరికి మధ్యలో ఆగిపోగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతరం మంజూరైన పెన్షన్లను అందజేశారు. RDO కృష్ణమూర్తి, మాజీ పీఎసీఎస్ ఛైర్మన్ వరప్రసాద్, ఎంపీడీవో ఫణీంద్ర కుమార్ ఉన్నారు.

News December 31, 2025

SKLM: జనవరి 28 వరకే ఛాన్స్

image

ఫింఛన్‌దారుల జీవన ప్రమాణ ధ్రువీకరణపత్రాలు వచ్చే నెల 28లోపు అందజేయాలని ఖజానా శాఖ ఉపసంచాలకుడు CH రవి కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీసు, కుటుంబ పింఛన్ దారులు వారి లైఫ్ సర్టిఫికెట్లు సమర్పిస్తే పెన్షన్లు లైవ్‌లో ఉంటాయన్నారు. జనవరి 1 నుంచి 28తేదీ లోపు సంబంధిత ధ్రువపత్రాలు CFMSలో వ్యక్తిగత లాగిన్‌లో అప్లోడ్ చేయాలని, కార్యాలయానికి అందజేయాలన్నారు.

News December 31, 2025

SKLM: జనవరి 2 నుంచి కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ

image

శ్రీకాకుళం జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాత భూహక్కు పత్రాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేకంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి వీటిని అందజేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 652 గ్రామాల్లో మొత్తం 2,54,218 పుస్తకాలను పంపిణీ చేయనున్నారని స్పష్టం చేశారు.