News May 10, 2024

72ఏళ్లు మెదక్‌లో ముగ్గురే మహిళా ఎంపీలు

image

అన్నిరంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలు చట్టసభల్లో అతంతగానే రాణిస్తున్నారు. మెదక్ లోక్‌సభ ఏర్పడి 72ఏళ్లు అవుతున్నా ఇక్కడి నుంచి కేవలం ముగ్గురు మహిళలే MPలుగా ఎన్నికయ్యారు. 1967 ఎన్నికల్లో సంగం లక్ష్మీబాయి(కాంగ్రెస్), 1980లో ఇందిరాగాంధీ, 2009లో విజయశాంతి(BRS) గెలిచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. జహీరాబాద్‌ నుంచి ఇప్పటివరకు ఒక్కరూ లేరు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహిళా ఎమ్మెల్యే సునీతారెడ్డి ఒక్కరే.

Similar News

News March 19, 2026

మెదక్: 61 మందితో డీసీసీ కార్యవర్గం ఏర్పాటు

image

61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇందులో ఉపాధ్యక్షులుగా 14 మంది, ప్రధాన కార్యదర్శులుగా 20 మంది, కార్యదర్శులుగా 20 మంది, అధికార ప్రతినిధులకు ఆరుగురు, ఒక కోశాధికారిని నియమించారు. మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కె.హరిత ఉపాధ్యక్షులుగా, తోడుపునూరి శివరామకృష్ణ కోశాధికారిగా నియమింపబడ్డారు.

News March 19, 2026

61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

image

మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీని గురువారం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ప్రకటించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా జిల్లా కమిటీని విస్తరించారు. జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులను మొత్తం 61 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీని విస్తరించినట్లు తెలిపారు.

News March 19, 2026

మెదక్: విషాదం.. వ్యక్తి సూసైడ్

image

నిజాంపేట మండల కేంద్రంలో అప్పుల బాధ తాళలేక పంజా సత్తయ్య(46) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మించడంతో అప్పులు పెరిగి, తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.