News May 10, 2024

కర్నూలు: మరో 3 రోజుల్లో ఎన్నికల సమరం

image

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరో 3 రోజుల్లో ప్రజాస్వామ్యంలో కీలక ఘట్టమైన ఓట్ల పండుగను మే 13న ఈసీ నిర్వహించనుంది. రేపటితో ప్రచార పర్వానికి తెరపడనుండటంతో అభ్యర్థులు ఈ 2 రోజుల పాటు తమ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మరోవైపు కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్ జీ.సృజన, డాక్టర్ కే.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Similar News

News March 13, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

➤ మంత్రాలయంలో ఆకట్టుకున్న భారీ రంగోలి
➤ రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా: మేయర్
➤ హౌసింగ్ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం: కలెక్టర్
➤ రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కు భూమిపూజ
➤ ఆదోని నియోజకవర్గ సమస్యలపై MLA పార్థసారథి అసెంబ్లీలో గళం 
➤ వైసీపీపై అసెంబ్లీలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి తీవ్ర విమర్శలు

News March 13, 2025

రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా: మేయర్

image

కర్నూలులో మౌలిక వసతుల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని నగర మేయర్ బీవై రామయ్య అన్నారు. గురువారం కర్నూలు నగర పాలక కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. 10 తీర్మానాలను, సాధారణ నిధుల నుంచి రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా ఊపారు. మేయర్ మాట్లాడుతూ.. ప్రజా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

News March 13, 2025

రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్‌కు భూమిపూజ

image

పత్తికొండ మండలంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మరో ముందడుకు పడింది. రూ.11కోట్ల వ్యయంతో కోతిరాళ్ల పంచాయతీ పరిధిలో ఈ యానిట్ ఏర్పాటుకు రేపు భూమి పూజ జరగనుంది. మంత్రి TG భరత్, ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. కాగా పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో టమాటా అధికంగా సాగువుతోంది. ఈయూనిట్ ప్రారంభమైతే తమకు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.

error: Content is protected !!