News May 10, 2024
కడప జిల్లాలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. జిల్లా మొత్తంలో ఉద్యోగులు 98.16 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉద్యోగులు అత్యధికంగా కడప, జమ్మలమడుగులో 100 శాతం మంది ఓటేశారు. నియోజకవర్గాల వారీగా చూస్తే బద్వేలు 99.59, పులివెందుల 94.67, కమలాపురం 94.54, ప్రొద్దుటూరులో 96.89, మైదుకూరులో 99.00 శాతం మంది ఉద్యోగులు ఓటు వేశారు.
Similar News
News July 4, 2025
కడప: ‘బాలల పరిరక్షణకు కృషి చేయాలి’

బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యురాలు బి.పద్మావతి అధ్యక్షతన బాలల హక్కుల పరిరక్షణ గురించి వివరించారు. వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
News May 8, 2025
పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News May 8, 2025
పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.