News May 10, 2024
LTI యాక్ట్కు అసెంబ్లీలో చంద్రబాబు మద్దతిచ్చారు: సజ్జల

AP: లాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు ప్రజల్ని భయపెడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ‘అసలు వీళ్లు మనుషులేనా? విపక్షంగా ఉన్న టీడీపీ ఈ బిల్లుకు పూర్తి మద్దతిచ్చింది. ఇప్పుడు పత్రికల్లో అడ్డగోలు ప్రకటనలు ఇస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ పూర్తయ్యాక భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుంది. ఈ యాక్ట్ చెత్త అని మోదీ, అమిత్ షాతో చెప్పించగలరా?’ అని ప్రశ్నించారు.
Similar News
News March 23, 2026
రాష్ట్రంలో 11వేలకుపైగా హెక్టార్లలో పంట నష్టం

AP: అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలోని 11,337 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 15 జిల్లాల్లోని 9,950 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 9 జిల్లాల్లోని 1,387 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వరి 2,650 హెక్టార్లు, మొక్కజొన్న 6,450 హెక్టార్లు, మినుముకు 485 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. మరోవైపు యుద్ధంతో ఎగుమతులు తగ్గి రాయలసీమలో కమలాపండు పంట ధర టన్ను ₹10వేలు తగ్గి ₹22వేలకు చేరింది.
News March 23, 2026
డర్టీ బాంబ్.. ఇరాన్ ఆఖరి అస్త్రం ఇదేనా?

సాధారణ పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక వ్యర్థాలను కలిపి చేసేదే ‘డర్టీ బాంబ్’. ఇది అణుబాంబులా భారీ విస్ఫోటం సృష్టించకపోయినా రేడియేషన్ను గాలిలో వ్యాపింపజేసి ప్రాంతాన్ని విషపూరితం చేస్తుంది. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం తగినంత ఉండటంతో దీని తయారీ సాధ్యమేనని నిపుణులు భావిస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇరాన్ ఈ డర్టీ బాంబును ఆఖరి అస్త్రంగా వాడే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
News March 23, 2026
ఏప్రిల్ 2 నుంచి JEE మెయిన్ సెషన్-2 ఎగ్జామ్స్

JEE మెయిన్-2026 చివరి విడత (సెషన్-2) పరీక్షల షెడ్యూల్ను NTA ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగానే తెలుసుకునేలా ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్స్’ను NTA విడుదల చేసింది. అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేసి వెబ్సైట్ నుంచి ఈ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు పరీక్షకు కొన్ని రోజుల ముందు వస్తాయి.


