News May 10, 2024

ప్రకాశం: మే 13న కార్మిక సంస్థలకు సెలవు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13వ తేదీన పోలింగ్ రోజున దుకాణాలు, కార్మిక సంస్థలకు ఈసీ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లుగా జిల్లా ఉపకార్మిక కమిషనర్ శ్రీనివాస కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటు వేయటానికి అర్హులైన ప్రతి ఒక్కరికి పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కార్మిక దుకాణాల చట్టం అనుసరించి నిబంధనలు పాటించాలన్నారు.

Similar News

News March 22, 2026

ప్రకాశం: ‘నేడు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు’

image

ప్రకాశం జిల్లాలో ఆదివారం కూడా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించడం వలన పెనాల్టీ పడదని అన్నారు. ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.

News March 22, 2026

గంజాయి నిందితులకు ఒంగోలులో కౌన్సెలింగ్

image

మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా ఒంగోలులో గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంజాయి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే 112కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News March 22, 2026

గంజాయి నిందితులకు ఒంగోలులో కౌన్సెలింగ్

image

మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా ఒంగోలులో గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంజాయి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే 112కు ఫిర్యాదు చేయాలని సూచించారు.