News May 10, 2024

కాంగ్రెస్ పాలనలో HYDలో బాంబు పేలుళ్లు: మోదీ

image

దేశాన్ని లూటీ చేయడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పాలనలో HYDలో ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా గుడి వద్ద బాంబు పేలింది. వారి పాలనలో పార్కు, గుడికి వెళ్లాలన్నా, బస్సు ఎక్కాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ NDAలో ఇలాంటివి ఎప్పుడైనా వినిపించాయా? గత పదేళ్లలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాం’ అని HYD సభలో వెల్లడించారు.

Similar News

News November 16, 2025

తిరుమలలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా?

image

స్వామివారి పుష్కరిణికి వాయువ్యంలో ఉన్న వరాహస్వామి ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి. పురాణాల ప్రకారం.. విష్ణుమూర్తి వరాహావతారంలో భూమిని పైకెత్తారు. ఆయన అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో వెలిశారు. అందుకే, తిరుమలలో తనను దర్శించుకునే భక్తులందరూ ముందుగా భూవరాహస్వామిని దర్శించుకుంటారని శ్రీనివాసుడు చెప్పారు. ఇప్పటికీ శ్రీవారి దర్శనానికన్నా ముందు దర్శనం, నైవేద్యం వరాహస్వామికే సమర్పిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 16, 2025

134 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

భారత వాతావరణ శాఖ(IMD) 134 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc, BE, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. PhD, ME, M.Tech కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 16, 2025

NSIC 70 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSIC)70 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ, MBA, CA, CMA, BE, బీటెక్, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nsic.co.in