News May 10, 2024
కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించిన విశాఖ కలెక్టర్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున శుక్రవారం సందర్శించారు. జిల్లాలోని క్లిష్టతరమైన పోలింగ్ కేంద్రాల్లో అమర్చుతున్న వెబ్కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటికే ఎన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇంకా ఎన్ని చోట్ల ఏర్పాటు చేయాలి అనే విషయమై అధికారులను ఆరా తీశారు.
Similar News
News December 31, 2025
విశాఖలో మూడు స్టాండింగ్ కమిటీల పర్యటన

విశాఖలో రైల్వే, వాణిజ్య, రక్షణ శాఖలకు చెందిన 3 పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు జనవరిలో పర్యటించనున్నాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కమిటీల పర్యటనకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News December 31, 2025
విశాఖ: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

విశాఖలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భోగాపురం ప్రాంతానికి చెందిన నర్సింగ్ వన్టౌన్ పరిధిలో ఉంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో అదే ప్రాంతంలో ఉంటున్న 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో కోర్టు పైవిధంగా శిక్షను విధిస్తూ మంగళవారం తీర్పు నిచ్చింది.
News December 31, 2025
విశాఖ: రేషన్ షాపుల్లో రూ.20కే కిలో గోధుమ పిండి!

జిల్లాలోని పట్టణ ప్రాంత రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం దృష్ట్యా జనవరి 2, 2026 నుంచి కార్డుకు కిలో చొప్పున గోధుమ పిండిని కేవలం రూ.20లకే పంపిణీ చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.45 నుంచి రూ.80 వరకు ఉన్న పిండిని సబ్సిడీ ధరకే అందిస్తున్నారు. పోషకాలతో కూడిన ఈ గోధుమ పిండిని లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.


