News May 10, 2024

జిల్లాలో 94% ఓటర్లకు స్లిప్పుల పంపిణీ పూర్తి: విశాఖ కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ కార్యక్రమం 94% పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున తెలిపారు. మిగిలిన వారికి ఈరోజు ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తామని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఓటర్ స్లిప్ తీసుకోని వారు ఓటర్ జాబితాలో పేరు ఉంటే పోలింగ్ రోజు స్లిప్పు తీసుకుని నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, పోలింగ్ కేంద్రం వద్ద వీటికి ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News February 27, 2026

మార్చి 3న కనకమహాలక్ష్మీ అమ్మవారి దర్శనాలు నిలిపివేత

image

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదిన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30వరకు కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ శోభారాణి తెలిపారు. ఆరోజు ఉదయం పంచామృతాభిషేకం అనంతరం గుడి మూసి వేయనున్నట్టు తెలిపారు. గ్రహణానంతరం రాత్రి సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు అనుమతిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News February 27, 2026

అరుదైన క్యాన్సర్‌కు చికిత్స చేసిన కేజీహెచ్ వైద్యులు

image

ఐదు గంటల పాటు రోగికి సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించారు కేజీహెచ్ వైద్యులు. మాడుగుల ప్రాంతానికి చెందిన43 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఆబ్జెక్టివ్ జాండీస్ వ్యాధిగా నిర్ధారణ అయింది. వైద్యులు వెండి తేజేశ్వరరావు పరీక్షలు నిర్వహించి ఐదు గంటల పాటు శ్రమించి సర్జరీ చేశారు. అరుదైన క్యాన్సర్‌గా అధిక మరణాలు కలిగి ఉన్న ఈ వ్యాధి పూర్తిగా తగ్గేలా సర్జరీ చేసి చికిత్స అందించిన వైద్యులకు రోగి కృతజ్ఞతలు తెలిపారు.

News February 27, 2026

45 కేసులు ఛేదన.. 76 మంది అరెస్టు: సీపీ

image

గడిచిన జనవరి నెలలో 69 ఆస్తి నేరాలు జరిగాయని 45 కేసులు గుర్తించి 76 మందిని అరెస్టు చేశామని నగర పోలీస్ కమిషనర్ శంఖబత్రబాగ్చి తెలిపారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యల ప్రాపర్టీ మేళ నిర్వహించగా రూ.39.79 లక్షలు, 420 పోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ 63 లక్షలు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు నగరంలో రూ. 13.94 కోట్లు విలువైన మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.