News May 11, 2024
NZB: ఓటేయ్యడానికి ఈ ఇవి తీసుకెళ్లోచ్చు: కలెక్టర్

నిజామాబాద్ ఓటర్కార్డు లేని ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద యొక్క గుర్తింపు పత్రాలను తీసుకెళ్లి చూపించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్కార్డు, జాబ్కార్డ్, పాసుబుక్, ఇన్సూరెన్స్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, పాస్పోర్ట్, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ గుర్తింపుకార్డుల్లో ఏదైనా తీసుకొని వెళ్ళి ఓటు వేయవచ్చని పేర్కొన్నారు.
Similar News
News December 25, 2025
కమ్మర్పల్లి: కారు ఢీ.. ఒకరి మృతి

కమ్మర్పల్లి మండలం రాజరాజేశ్వరి నగర్లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాల గంగాధర్(70) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కారు వెనక నుంచి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది గంగాధర్ను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
News December 25, 2025
నిజామాబాద్: తెలంగాణ గోరక్ష సభ్యునిగా ధాత్రిక రమేష్

నిజామాబాదు జిల్లా కేంద్రానికి చెందిన ధాత్రిక రమేష్ తెలంగాణ ప్రాంత గోరక్ష విభాగం సభ్యులుగా నియమించినట్లు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ తెలిపారు. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో గోరక్ష అవగాహన కార్యక్రమాలతో పాటు గోఅధారిత వ్యవసాయం తదితర అంశాలపై యువత రైతుల్లో కార్యశాల నిర్వహించి చైతన్య పర్చడానికి కృషి చేస్తామన్నారు.
News December 25, 2025
నిజామాబాద్: ఏసుక్రీస్తు యావత్ ప్రపంచానికి దేవుడు: పీసీసీ చీఫ్

ఏసుక్రీస్తు యావత్ ప్రపంచానికి దేవుడని, ఆయన చూపిన ప్రేమ, కరుణా మార్గం మానవాళికి గొప్ప సందేశమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం గచ్చిబౌలిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడికి తన మతాన్ని ప్రార్థించే సంపూర్ణ స్వేచ్ఛ ఈ దేశంలో ఉందన్నారు. అన్ని మతాలను గౌరవించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.


