News May 11, 2024

ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు: అనకాపల్లి కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకులు, ఎస్పీ కేవీ మురళీకృష్ణలతో కలిసి పోలీసు అధికారులతో శాంతిభద్రతల నిర్వహణపై చేపడుతున్న సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి డిఎస్పీ స్థాయి అధికారిని నియమించామన్నారు.

Similar News

News March 10, 2026

విశాఖలో నేడు అంతర్జాతీయ నీటి భద్రతా సదస్సు

image

విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ (VER) నీటి భద్రత ప్రణాళికపై మంగళవారం నోవాటెల్ హోటల్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి మార్గదర్శకత్వంలో సింగపూర్, ఆస్ట్రేలియా సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. పెరుగుతున్న నీటి అవసరాలు, వనరుల సమర్థ వినియోగం, అంతర్జాతీయ నిర్వహణ పద్ధతులపై నిపుణులు చర్చించనున్నారని అధికారులు పేర్కొన్నారు.

News March 9, 2026

విశాఖలో బ్యాడ్మింటన్ ఆడేవారికి గుడ్ న్యూస్

image

విశాఖపట్నం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ మెంబర్‌షిప్ కోసం జీవీఎంసీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 6 అంతర్జాతీయ స్థాయి కోర్టులతో కూడిన ఈ స్టేడియంలో 12 ఏళ్ల లోపు పిల్లలకు ఏడాదికి ₹2,600, పెద్దలకు ₹15,000 ఫీజుగా నిర్ణయించారు. ఉదయం 5 నుండి 10 వరకు, సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు ఆడేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

News March 9, 2026

విశాఖ: హిందుజా పవర్ ప్లాంట్‌కు భారీ జరిమాన

image

విశాఖలో హిందుజా పవర్ ప్లాంట్‌పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకుంది. ప్లాంట్ నుంచి వచ్చే యాష్పాండ్ ధూళి వలన స్థానిక ప్రజలు చర్మవ్యాధులు బారిన పడుతున్నారని టీడీపీ కార్పొరేటర్ రౌత్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హిందుజా పవర్ ప్లాంట్‌కు రూ.6 కోట్ల 78 లక్షలు జరిమానా విధించింది.