News May 11, 2024

ప.గో.: నేడే LAST.. గెలుపుపై మీ కామెంట్..?

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. – మన ప.గో. జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?

Similar News

News March 16, 2026

ప.గో: మళ్లీ పాత చోటకే PGRS వేదిక

image

గొల్లల కోడేరు జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) యథావిధిగా నిర్వహించనున్నట్లు SP అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గతంలో రోడ్డు పనుల వల్ల భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగేదని, పనులు పూర్తి కావడంతో తిరిగి SP కార్యాలయానికి మార్చినట్లు వెల్లడించారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి తమ సమస్యల విన్నపానికి నేరుగా SP కార్యాలయానికి రావాలని కోరారు.

News March 16, 2026

ప.గో: సీఆర్పీలకు ఐదు నెలలుగా అందని వేతనాలు

image

పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాల్లో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నియమించిన సీఆర్పీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియామకమై ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు అందకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగ భద్రతపై అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో గందరగోళం నెలకొందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News March 16, 2026

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.