News May 11, 2024
కడప: ఓటుకు రూ.4 వేలు.?

కడప జిల్లాలో ఓట్ల పండగ జరగనుంది. నేటితో ప్రచారం ముగియనుండగా, ఓటర్లను నాయకులు ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఓటుకు రూ.2వేలు ఇస్తున్నట్లు సమాచారం. కడప, బద్వేలు, కోడూరులో 1000 నుంచి 1500 ఇస్తుండగా, రాజంపేటలో గరిష్ఠంగా రూ.4 వేలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో అభ్యర్థులు పోటాపోటీగా డబ్బులు పంచడానికి సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది.
Similar News
News December 27, 2025
ప్రొద్దుటూరు: నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,400
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,248
* వెండి 10 గ్రాములు ధర రూ.2,530
News December 27, 2025
కడప: ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లకు నోటీసులు.!

జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫేజ్ -3 ఇళ్ల నిర్మాణాలను గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇచ్చారు. వారు లబ్ధిదారుల నుంచి, ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా వదిలేశారు. దీనిపై అధికారులు పరిశీలన జరిపి సంబంధిత సిబ్బందికి జీతాలు నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చారు. వ్యతిరేకత రావడంతో కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చారు.
News December 27, 2025
కడప: నలుగురిని సస్పెండ్ చేసిన కలెక్టర్

భారత ఎన్నికల సంఘం ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నలుగురు పోలింగ్ బూత్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల సర్వేలో విధుల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్నట్లు తెలిపారు. భాగంగా సీ.కే దిన్నెలోని తాడిగొట్ల, వల్లూరులోని టీజీ పల్లె, వీరపునాయుని పల్లెలోని అలిదెన, ఎన్. పాలగిరి సచివాలయాల్లో పనిచేస్తున్న BLOలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.


