News May 11, 2024

REWIND.. ఖమ్మం నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు

image

ఖమ్మం లోక్ సభకు ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ 11 సార్లు గెలిచింది. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ ఒక్కోసారి గెలుపొందాయి. కాంగ్రెస్ నుంచి లక్ష్మీ కాంతమ్మ హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడి నుంచి గెలిచిన జలగం వెంగళరావు, పీవీ రంగయ్యనాయుడు, రేణుకాచౌదరి కేంద్ర మంత్రి పదువులు చేపట్టారు. సిట్టింగ్ ఎంపీ నామా బీఆర్ఎస్, టీడీపీ నుంచి ఒక్కోసారి ఎంపీగా ఉన్నారు.

Similar News

News February 28, 2026

HPV వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో 9 నుంచి 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు HPV వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. దీని వల్ల మహిళల్లో సర్వైవల్ క్యాన్సర్ రాకుండా చేయవచ్చని తెలిపారు. అటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్నం భోజన నాణ్యతను జిల్లా అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

News February 28, 2026

ఏన్కూర్‌లో ఎంపీపీఎస్ హెచ్‌ఎమ్ సస్పెండ్

image

ఏన్కూర్ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు బుగ్గినేని జయను సస్పెండ్ చేశారు. ఈసీఆర్ కార్యక్రమం అమలులో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను మండల విద్యాధికారి నాగిరెడ్డి అందజేశారు.

News February 28, 2026

దెందుకూరు జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయుడిపై విచారణ

image

మధిర మండలం ZPHS దెందుకూరులో తెలుగు ఉపాధ్యాయుడు స్వర్గం శ్రీనివాసరావుపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. విద్యార్థినుల పట్ల ఆయన అనుచితంగా ప్రవర్థించాడని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్‌ను ఎంక్వయిరీ అధికారిగా నియమించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిని కూడా విచారణ బృందంలో చేర్చారు.