News May 11, 2024
నేటితో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెర..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మహబూబాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం నేటితో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ చేయాలని ఆయా పార్టీలను ఎలక్షన్ కమిషనర్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
Similar News
News July 7, 2025
ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

పేద, మధ్య తరగతి వర్గాల కలల ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం భారీగా పెరిగింది. ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న తరుణంలో సామగ్రి రేట్లు అధికం కావడంతో భారంగా మారింది. వీటికి తోడు సిమెంట్, స్టీల్, ఇసుక ధరలతో పాటు, కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలను బట్టి ఒక్కో ఇంటిపై ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పాటు, మరో రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు అదనపు భారం పడుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.
News July 7, 2025
ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

☆ బోనకల్, వైరా మండలాల్లో నేడు విద్యుత్ నిలిపివేత
☆ వేంసూర్లో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
☆ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం
☆ నేడు జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
☆ కారేపల్లిలో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
☆ ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమం
☆ జిల్లాలో నేడు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల పర్యటన
☆ వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
News July 7, 2025
పాలేరు జలాశయానికి చేరిన నాగార్జున సాగర్ జలాలు

కూసుమంచి మండలం పాలేరు జలాశయానికి ఆదివారం సాగర్ జలాలు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లాలో తాగునీటి అవసరాల నిమిత్తం శుక్రవారం ఉదయం నాగార్జున సాగర్ డ్యాం నుంచి 3000 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల అనంతరం ఆదివారం రాత్రి జలాశయానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.