News May 11, 2024

కడప: ‘సమయం లేదు మిత్రమా’ అంటున్న నాయకులు

image

2024 ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. మరికొన్ని గంటలే ఉండటంతో నాయకులు సమయం లేదు మిత్రమా అంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఫోన్లు, ప్రకటనలు, ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. నాయకులు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించేందుకు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ట్రావెల్ ఛార్జులు కూడా నాయకులే ఇస్తుండటం గమనార్హం.

Similar News

News March 15, 2026

కడప జిల్లా వ్యాప్తంగా 282 కేసులు

image

కడప జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనల పాటించని 282 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరికి రూ.58,340లు జరిమానాగా విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పక పెట్టుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు తెలిపారు.

News March 14, 2026

కడప: 2 వారాల గడువు..రూ.97 కోట్లే లక్ష్యం.!

image

జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.97.17 కోట్లు పేరుకు పోయాయి. 2 వారాల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పన్ను వసూళ్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల వారీగా బకాయిలు ఇలా (రూ.కోట్లలో) ఉన్నాయి. *KDP – రూ.62.93 *PDTR – రూ.20.14 *PLVD – రూ.4.58 *జమ్మలమడుగు – రూ.2.49
*ఎర్రగుంట్ల – రూ.3.20 *మైదుకూరు – రూ.3.09 *కమలాపురం – రూ.0.74కోట్లు.

News March 14, 2026

అదనపు ఛార్జీలు తీసుకుంటే చర్యలు: RDO

image

జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రెవెన్యూ డివిజన్ అధికారి భవన అన్నారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. LPG పంపిణి సంస్థలు తప్పనిసరిగా స్టాక్ బోర్డును ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే సిలిండర్ సరఫరా చేయాలన్నారు. అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేయవద్దని ఆమె హెచ్చరించారు.