News May 11, 2024
లెక్క మారుతోంది.. ఓటుకి రూ.3వేల నుంచి రూ.5వేలు!

AP: రాష్ట్రంలో ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో నగదు పంపిణీ లెక్కలు మారిపోతున్నాయి. ఇప్పటికే రూ.3వేల వరకు పంపిణీ జరిగిపోయినట్లు సమాచారం. అయితే ప్రత్యర్థి పార్టీ నగదు మొత్తాన్ని పెంచడంతో అవతలి పార్టీ కూడా మరింత పెంచి ఇస్తోందట. పోటాపోటీగా సాగుతున్న పంపకాల్లో కొన్నిచోట్ల ఓటుకు రూ.5000 దాటి పోయినట్లు తెలుస్తోంది. పెంచిన మొత్తాన్ని ఇవాళ, రేపు ఓటర్లకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Similar News
News March 26, 2026
మరో డేంజర్.. ముదరనున్న చమురు సంక్షోభం?

ఖర్గ్ <<19478356>>ద్వీపం<<>> స్వాధీనానికి US ప్లాన్ చేస్తే యెమన్ సమీపాన ఉండే బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సరకు రవాణాకు ఇది ఎంతో కీలకం. ఇది మూతబడితే ఆఫ్రికా <<19394249>>చుట్టూ<<>> తిరిగి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ట్రంప్ చర్యలతో చమురు సంక్షోభం ముదిరేలా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ఇటీవల యెమెన్ మిలిటెంట్ గ్రూప్ హౌతీ ఇరాన్కు మద్దతు తెలిపింది.
News March 26, 2026
కరెంట్ ఛార్జీలపై GOOD NEWS

AP: FY27లో కరెంట్ ఛార్జీలు పెంచకూడదని, ప్రజలపై ట్రూఅప్ భారమూ వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కమ్లకు ₹15,790Cr రెవెన్యూ లోటును తామే భరిస్తామని APERCకి లేఖ రాసింది. దీనివల్ల 1.30Cr గృహ విద్యుత్ వినియోగదారులకు మేలు జరగనుంది. 22L మంది రైతులకు, 22 లక్షల SC, ST, ఇతర బలహీన వర్గాల కుటుంబాలకు ఉచిత/రాయితీ విద్యుత్ కొనసాగనుంది. 2L మంది వాణిజ్య వినియోగదారులకు యూనిట్ ₹12.25 నుంచి ₹9.95కు తగ్గనుంది.
News March 26, 2026
బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. విచారణకు ఆదేశం

AP: మార్కాపురం జిల్లాలో ఘోర <<19478496>>బస్సు ప్రమాదంపై<<>> సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు.


