News May 11, 2024

ఇక వడగాల్పులు ఉండవు: IMD

image

ఉక్కపోతతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ఏడాది వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు చల్లబడటం వల్ల అటు నుంచి వస్తున్న గాలులతో దేశంలో వడగాల్పుల తీవ్రత తగ్గుతోందని తెలిపింది. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పెరిగే అవకాశం ఉందని వివరించింది.

Similar News

News November 6, 2025

రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు?

image

AP: రాష్ట్రంలో కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటుకానున్నట్లు సమాచారం. అలాగే నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లె, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

News November 6, 2025

జీరో టిల్లేజి సాగు విధానం – ఏ పంటలకు అనుకూలం?

image

వరి కోత యంత్రంతో పైరును కోశాక దుక్కి చేయకుండా ఇతర పంట విత్తనాలను విత్తే పద్ధతిని జీరో టిల్లేజి సాగు పద్ధతి అంటారు. ఇది మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు, శనగకు అనుకూలం. ఈ పద్ధతిలో విత్తేటప్పుడు చాలినంత తేమ నేలలో లేకపోతే ఒక తడి ఇచ్చి విత్తుకొవడం మంచిది. విత్తనాలను చేతితో విత్తే పరికరాలతో నాటితే సమయం ఆదా అవుతుంది. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ ఉండేట్లు విత్తుకోవాలి.

News November 6, 2025

నిద్ర లేవగానే కర దర్శనం ఎందుకు చేయాలి?

image

ఉదయం నిద్ర లేవగానే కర దర్శనం చేసుకుంటే లక్ష్మీ, సరస్వతీ, విష్ణుమూర్తులను దర్శించుకున్నట్లే అని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఆచారం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. రాత్రంతా కదలిక లేకుండా ఉన్న కంటి నరాలకు ఈ ప్రక్రియ చిన్న వ్యాయామంలా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల కళ్లకు నెమ్మదిగా కదలిక లభిస్తుంది, కంటి దోషాలు రాకుండా నివారిస్తుంది.
☞మన ఆచారాలు, వాటి వెనకున్న సైన్స్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.