News May 11, 2024
ఏపీలో పోలింగ్ టైమింగ్స్ విడుదల చేసిన ఈసీ

ఏపీలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆ సమయంలోగా క్యూలైన్లో నిల్చున్న వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తారు.
Similar News
News December 27, 2025
ఒకేరోజు రూ.20 వేలు పెరిగిన వెండి ధర

ఇవాళ కూడా వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగింది. నిన్న KG వెండి రూ.9 వేలు పెరగ్గా ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.20వేలు పెరిగింది. దీంతో కిలో వెండి కాస్ట్ రూ.2,74,000కు చేరింది. 6 రోజుల్లోనే కిలో సిల్వర్ రేటు రూ.48వేలు పెరగడం గమనార్హం. మరోవైపు బంగారం ధర కూడా పెరుగుతూనే ఉంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.1,200 పెరిగి రూ.1,41,220కి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,100 పెరిగి రూ.1,29,450కి చేరింది.
News December 27, 2025
డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు!

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లో ఈగల్ టీమ్ చేసిన దాడుల్లో భారీగా కొకైన్, MDMA సీజ్ చేశారు. నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి రెగ్యులర్ కస్టమర్ల లిస్టులో అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అమన్ పరారైనట్లు సమాచారం.
News December 27, 2025
ఇక తక్కువ అద్దెకే రైతుకు సాగు పరికరాలు

AP: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు తక్కువ ఖర్చుతో సాగుకు అవసరమయ్యే పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు CHC(కస్టమ్ హైరింగ్ సెంటర్)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 300 CHCల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇక్కడ ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, డ్రోన్లు, మినీ ట్రక్కులు, భూసార పరీక్షలు చేసే కిట్స్, మినీ రైస్ మిల్లు, ఇతర పరికరాలను తక్కువ అద్దెకు రైతులకు అందిస్తారు.


