News May 11, 2024

ద్వారంపూడికి పవన్ మాస్ వార్నింగ్

image

కాకినాడ సిటీలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కాకినాడ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘నీ సంగతి చూస్తా.. నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టావు, ప్రకృతి వనరులను దోచేశావు, పచ్చని మడ అడవులను నరికేశావ్.. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి నిన్ను రోడ్డుమీదికి లాక్కొస్తాం’ అంటూ ఫైర్ అయ్యారు.

Similar News

News March 14, 2026

RJY: డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా

image

ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగ మద్యం, గంజాయి సేవనం, జూదం, చైన్ స్నాచింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయడమే లక్ష్యంగా రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాడుబడ్డ ఇళ్లు, అపార్ట్మెంట్లను డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తున్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 13, 2026

తూ.గో జిల్లాలో నిరంతరాయంగా LPG సరఫరా

image

ఏపీ ప్రభుత్వం గృహ అవసరాలు & అత్యవసర సేవలకు నిరంతరాయంగా LPG సరఫరా జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన IOCL, HPCL, BPCL సంస్థలతో పాటు LPG పంపిణీదారులతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నదనీ జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఉన్న 52 ఎల్పీజీ గ్యాస్ పంపిణీదారుల ద్వారా సుమారు 8.67 లక్షల గ్యాస్, కనెక్షన్ దారులకు గ్యాస్ సరఫరా జరుగుతోందన్నారు.

News March 13, 2026

రాజమండ్రి: రేపు ‘జాతీయ లోక్ అదాలత్’

image

మార్చి 14న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, రంపచోడవరం పరిధిలోని కక్షిదారులు తమ పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు. కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ, ఖర్చు తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.