News May 11, 2024

నాగిరెడ్డిపేట: చెరువులో పడి ఒకరు మృతి

image

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి గ్రామ చెరువులో పడి ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మంత్రి లక్ష్మణ్ చెరువులో ఉన్న పశువులను బయటకు తీసుకురావడానికి వెళ్లి మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. లక్ష్మణ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 14, 2025

బోధన్: కోచింగ్ లేకుండా GOVT జాబ్ సాధించారు..!

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ వాసి గుడ్ల సాయిప్రసాద్ బోధన్ జూనియర్ కాలేజీలో కెమిస్ట్రీ సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించారు. ఎలాంటి కోచింగ్ సెంటర్ వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో పాఠాలు విని జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తన తల్లి సునీత, సోదరి ప్రియాంక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకున్నట్లు సాయిప్రసాద్ తెలిపారు.

News March 14, 2025

నిజామాబాద్‌: మనిషి పుర్రె, ఎముకల కలకలం 

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బినోల శివారులో గురువారం మనిషి పుర్రె, ఎముకలు లభ్యమయ్యాయని ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. గాంధీనగర్‌కి చెందిన వ్యక్తులు పని నిమిత్తం బినోల శివారు అడవిలోకి వెళ్లగా మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయన్నారు. గాంధీనగర్ కారోబార్ చింతల మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో స్థానికంగా ఎవరైనా అదృశ్యమయ్యారా విచారణ చేస్తామన్నారు.

News March 14, 2025

భీమ్‌గల్: మహిళ ఆత్మహత్య

image

ఆత్మహత్య చేసుకోని మహిళ మృతి చెందిన ఘటన భీమ్‌గల్ మండలం చేంగల్‌లో చోటు చేసుకుంది. SI మహేశ్ ప్రకారం.. శారద అనే మహిళ కూతురితో చేంగల్‌లో నివాసం ఉంటుంది. భర్త చనిపోవడంతో ఇంటి బాధ్యతలు తానే చుసుకుంటోంది. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఈ నెల 12న నాప్తలీన్ బాల్స్ మింగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం ఆర్మూర్ ఆస్పత్రిలో చేర్చగా ఈ నెల 13న మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

error: Content is protected !!