News May 11, 2024
అనంతపురంలోకి 100 మంది బయటి వ్యక్తులు..?

ఎన్నికల నేపథ్యంలో అనంతపురంలో అల్లర్లు సృష్టించడానికి వంద మంది బయటి వ్యక్తులు నగరానికి వచ్చినట్లు జనసేన నేత జయరామిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు డీఎస్పీ టీవీవీ ప్రతాప్ కుమార్కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అల్లుడు వారిని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన డీఎస్పీ.. తాము నగరంలో సోదాలు జరుపుతామని జయరామిరెడ్డికి హామీ ఇచ్చారు.
Similar News
News April 18, 2026
ఈనెల 21న ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ అనంతపురం పర్యటన

ఈనెల 21న కే.ఎస్. జవహర్ అనంతపురం జిల్లాకు రానున్నారు. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఎస్సీ సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, రోస్టర్ అమలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు.
News April 18, 2026
తాడిపత్రిలో నేడు వాహనాల బహిరంగ వేలం

తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 69 వాహనాలకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు టౌన్ సీఐ ఆరోహణరావు తెలిపారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు, రూ.5,000 ముందస్తు డిపాజిట్ చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ వేలం ప్రక్రియ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరుగుతుందని, ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 18, 2026
తాడిపత్రిలో నేడు వాహనాల బహిరంగ వేలం

తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 69 వాహనాలకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు టౌన్ సీఐ ఆరోహణరావు తెలిపారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు, రూ.5,000 ముందస్తు డిపాజిట్ చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ వేలం ప్రక్రియ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరుగుతుందని, ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


