News May 12, 2024
నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

AP: పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఈరోజు సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్కు 90 నిముషాల ముందు మాక్పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రేపు ఉదయం సరిగ్గా ఏడింటికి పోలింగ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 22, 2026
కాబోయే తండ్రుల్లోనూ ‘ప్రెగ్నెన్సీ’ లక్షణాలు

గర్భిణుల్లో వాంతులు, అలసట, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, బరువు పెరగటం సహజం. కానీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొందరు భర్తల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే Couvade సిండ్రోమ్ అంటారు. భాగస్వామితో బలమైన భావోద్వేగ అనుబంధం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 20% మందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. కొందరు పురుషుల్లో హార్మోన్ల మార్పులూ జరుగుతాయని పేర్కొంటున్నారు.
News March 22, 2026
ఈ జిల్లాల్లో వర్షాలు!

తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో ఇవాళ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. Hydలో కూడా స్వల్పంగా వర్షం పడొచ్చని, ఎక్కువగా పొడి వాతావరణమే ఉంటుందని చెప్పింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వివరించింది.
News March 22, 2026
అన్నదాతలకు అన్నగా బాధ్యత తీసుకున్నా: CM రేవంత్

TG: రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నామని CM రేవంత్ తెలిపారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానన్నారు. ‘70L మందికి ₹9,000Cr రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ సిద్దిపేట(D) నర్మెట్ట గ్రామ వేదికగా పథకాన్ని అమలు చేస్తున్నాం. అక్కడ పామాయిల్ పరిశ్రమ, రిఫైనరీ యూనిట్కు శంకుస్థాపన చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.


