News May 12, 2024

ADB: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సమయాలు

image

పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతున్నట్లు ఉమ్మడి ADB జిల్లా రిటర్నింగ్ అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్‌లో ఉదయం 7 – సాయంత్రం 6 గంటల వరకు ఆసిఫాబాద్, సిర్పూర్‌, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లిలో ఉదయం 7 – సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు.
SHARE IT

Similar News

News March 18, 2026

ADB: గ్రామాలను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా మార్చాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ‘మూడవ కన్ను’లా పనిచేస్తాయని, ప్రతి ఒక్కరూ వీటి ఏర్పాటుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

News March 18, 2026

ADB: ఖోడద్ అభివృద్ధికి ఉద్యోగుల కృషి భేష్- కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామ అభివృద్ధికి ఆ గ్రామానికి చెందిన ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. సొంత ప్రాంతంపై మమకారంతో విజ్ఞానాన్ని పంచేందుకు లైబ్రరీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు.

News March 18, 2026

ADB: ఖోడద్ అభివృద్ధికి ఉద్యోగుల కృషి భేష్- కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామ అభివృద్ధికి ఆ గ్రామానికి చెందిన ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. సొంత ప్రాంతంపై మమకారంతో విజ్ఞానాన్ని పంచేందుకు లైబ్రరీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు.