News May 12, 2024
సీ విజిల్ యాప్కు 75 ఫిర్యాదులు: కలెక్టర్ గౌతమ్

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై సీ విజిల్ ద్వారా జిల్లాలో 75 ఫిర్యాదులు రాగా అందులో 72 ఫిర్యాదులపై సకాలంలో స్పందించి పరిష్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మిగతా మూడు ఫిర్యాదుల విషయంలో మాత్రం 100 నిమిషాలు దాటాక వెళ్లినట్లు చెప్పారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1950కి ఖమ్మం జిల్లాలో 153 ఫిర్యాదులు రాగా 152, భద్రాద్రి జిల్లాలో వచ్చిన 82 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.
Similar News
News March 18, 2026
ఖమ్మం: నీటి ఎద్దడిపై అధికారుల ‘యాక్షన్ ప్లాన్’

ఖమ్మం జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మకమైన 18 గ్రామాలను గుర్తించి, అక్కడ ట్యాంకర్లు లేదా ప్రైవేట్ వనరుల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్యల ఫిర్యాదుల కోసం 1916 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చామని, మరమ్మతుల కోసం సుమారు రూ.90 లక్షలు ఖర్చవుతుందని ఈఈ పుష్పలత తెలిపారు.
News March 18, 2026
క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: ఖమ్మం DMHO

హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్ ముప్పును ముందస్తుగానే నివారించవచ్చని DMHO రామారావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 14-15 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేస్తున్నామని, ఈ నెల 8న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 16వ తారీకు వరకు 1300 మందికి వ్యాక్సిన్ అందించామని వెల్లడించారు.
News March 17, 2026
నాలుగేళ్లలో ఫసల్ బీమా క్లెయిమ్లు: కేంద్రం

దేశవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా కల్పిస్తున్న ఆర్థిక భరోసాపై ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా భారీ స్థాయిలో క్లెయిమ్లు చెల్లించినట్లు వెల్లడించారు. రైతులకు ఈ పథకం ఒక రక్షణ కవచంలా పనిచేస్తోందన్నారు.


