News May 12, 2024

సగర్వంగా ఓటేద్దాం: ఈసీ

image

ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భారత ఎన్నికల సంఘం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఓటరు చైతన్యం కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఈసీ రెండ్రోజులుగా మెసేజ్‌లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’ అన్న సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తోంది. పనులుంటే వాయిదా వేసుకోండి.. రేపు మాత్రం ఓటు వేయండి అంటూ పిలుపునిస్తోంది.

Similar News

News March 21, 2026

గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్!

image

ఏప్రిల్, మే, జూన్ నెలల ఉచిత రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు రాష్ట్రాలకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు లబ్ధిదారులకు అధికారికంగా సమాచారం అందించే అవకాశం ఉంది. రాబోయే 3 నెలలు ఎండల తీవ్రత, గోదాముల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వర్షాకాలంలోనూ ఇలాగే పంపిణీ చేసింది.

News March 21, 2026

రోహిత్‌ను MI పూర్తిగా వాడుకోవాలి: ఇర్ఫాన్

image

స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించారు. ‘రోహిత్‌ను MI ఎలా యూజ్ చేసుకుంటుందనేది కీలకం. ఇంపాక్ట్ ప్లేయర్‌లా కాకుండా అతడు గ్రౌండ్‌లో ఉండటం చాలా ముఖ్యం. కెప్టెన్‌కు సాయపడగలడు. విజయవంతమైన సారథిని వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలి’ అని సూచించారు. గత IPLలో రోహిత్ భారీగా పరుగులు చేశారని, ఈసారి ఇంకా మెరుగ్గా ఆడతారని అన్నారు.

News March 21, 2026

TDP మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

image

AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం TDP మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి(81) కన్నుమూశారు. అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈయన ఉమ్మడి అనంతపురం జిల్లా TDP అధ్యక్షుడిగా 10 ఏళ్లు పనిచేశారు. పంచాయతీ వార్డు సభ్యుడి స్థాయి నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎదిగారు. అటు ఉమ్మడి ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా పని చేశారు. ఈయన మృతిపట్ల ఆ పార్టీ నేతలు సంతాపం తెలిపారు.