News May 12, 2024
UPDATE: మహిళల మృతదేహాలు లభ్యం

గోదావరిలో మునిగి చనిపోయిన ఆలమూరు మండలం బడుగువానిలంకకు చెందిన ముగ్గురి డెడ్బాడీలు లభ్యమయ్యాయి. పల్లూరి సత్యఅనంతలక్ష్మి(40), కప్పిరెడ్డి ఏసమ్మ(60), కర్రీ సునీత శనివారం వాడపల్లి వెంకటేశ్వరాలయానికి గోదావరి పాయలోంచి నడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలో మడికి వద్ద వాడపల్లిలంక సమీపంలో వారు <<13231697>>నీటిలో మునిగిన సంగతి <<>>తెలిసిందే. మృతదేహాలు లభ్యం కాగా.. SI శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. మరొకరి ఆచూకీ తెలియరాలేదు.
Similar News
News April 3, 2026
కల్తీ పాలపై ఉక్కుపాదం: కలెక్టర్ హెచ్చరిక

జిల్లాలో అనధికారిక పాల విక్రయాలపై కలెక్టర్ కీర్తి చేకూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ పాలను అరికట్టేందుకు పాల ఉత్పత్తిదారులు, విక్రేతలు తప్పనిసరిగా FSSAI వద్ద నమోదు చేసుకోవాలని ఆదేశించారు. పర్యవేక్షణ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నాణ్యమైన పాలు మాత్రమే విక్రయించాలని ఆమె స్పష్టం చేశారు.
News April 3, 2026
తూర్పుగోదావరి జిల్లాకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(PHC/UPHC) సేవలలో తూ.గో. జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు DMHO కె.వెంకటేశ్వరరావు ప్రకటించారు. శుక్రవారం బొమ్మూరులోని కార్యాలయం వద్ద సిబ్బందితో కలిసి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సానుకూల అభిప్రాయం ఫిబ్రవరిలో 74.8\% ఉండగా, మార్చిలో అది 77.8%కి పెరిగిందని ఆయన తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన కొనియాడారు.
News April 3, 2026
తూ.గో: పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీపీఓ వి.శాంతమణి అధికారుల జాబితాను విడుదల చేశారు. నియమితులైన అధికారులు తక్షణమే బాధ్యతలు స్వీకరించి గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పాలనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


