News May 12, 2024
సరిహద్దుల్లో శాంతితోనే చైనాతో సంబంధాల పునరుద్ధరణ: జైశంకర్

చైనా సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు వివాదాలపై సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. సరిహద్దుల్లో శాంతి వాతావరణం ఉంటేనే ఆ దేశంతో సంబంధాల పునరుద్ధరణ సాధ్యమవుతుందన్నారు. బోర్డర్లో ఘర్షణ వాతావరణం ఉన్నా చైనాతో వాణిజ్యం ఎందుకు పెరుగుతోందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘2014కు ముందు తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 21, 2026
827 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

సశస్త్ర సీమా బల్(SSB)లో 827 కానిస్టేబుల్(నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. డ్రైవర్, వెటర్నరీ, టైలర్, బార్బర్, వెయిటర్, కార్పెంటర్ తదితర ఉద్యోగాలున్నాయి. టెన్త్ పాస్, సంబంధిత విభాగంలో ITI, డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, వయసు 18-27 ఏళ్లు ఉండాలి. PET/PST, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ APR 21.
సైట్: https://ssb.gov.in/
News March 21, 2026
‘యుద్ధాన్ని మేము ప్రారంభించలేదు’.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు

యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని ప్రధాని మోదీతో ఫోన్ కాల్ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ స్పష్టం చేశారు. అణుశక్తిపై చర్చలు జరుగుతుండగానే US, ఇజ్రాయెల్ అన్యాయంగా దాడి చేశాయన్నారు. ఇరాన్ అణుకార్యకలాపాలను ఆపేందుకే ఈ దాడులు చేస్తున్నామన్న US వాదనను ఖండించారు. మాజీ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ అణ్వాయుధాలను తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. యుద్ధం ఆగాలంటే ప్రత్యర్థులు వెంటనే దాడులు ఆపాలన్నారు.
News March 21, 2026
వాహనదారులకు రిలీఫ్.. ఎల్లుండి నుంచి..

TG: ఒకే పేరుపై రెండో వాహనం కొంటే అదనంగా కట్టాల్సిన 2% లైఫ్ ట్యాక్స్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 23 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వాహనదారులకు ఊరట లభించనుంది. ఇక అదే రోజున రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్ను మంత్రి పొన్నం ప్రభాకర్ లాంచ్ చేయనున్నారు. రాష్ట్ర వాహనాల డేటా ఆ పోర్టల్తో అనుసంధానం కానుంది. దీంతో అంతర్రాష్ట్ర వాహనాల కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఈజీ అవుతుంది.


