News May 12, 2024

HYD: కేంద్రాలకు రండి.. ఓటేయండి: కలెక్టర్లు

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ రేపు ఓటేసేందుకు రావాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిర్భయంగా వచ్చి ఓటేయాలని కోరారు. యువత చొరవ చూపి అందరూ ఓటేసేలా చూడాలన్నారు.

Similar News

News November 3, 2025

HYD: కాంగ్రెస్ అభివృద్ధికి, BRS అవినీతికి మధ్య పోరాటం: కాంగ్రెస్ నేత

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక అనేది కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి, BRS చేసిన అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటమని TPCC ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ కూకట్‌పల్లి ఇన్‌ఛార్జ్ బండి రమేశ్ తెలిపారు. మధురానగర్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని, దానిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.

News November 3, 2025

HYD: బస్సు ప్రమాదంపై KCR, KTR దిగ్భ్రాంతి

image

మీర్జాగూడ ప్రమాద ఘటనపై మాజీ CM KCR, మాజీ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు.

News November 3, 2025

మీర్జాగూడ ప్రమాదం.. కండక్టర్ సేఫ్

image

మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ప్రయాణికులతో పాటు డ్రైవర్ దస్తగిరి బాబు చనిపోయాడు. కండక్టర్ రాధ గాయాలతో బయటపడినట్లు తెలిసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్, తాండూరు MLA బుయ్యని మనోహర్, MLC పట్నం మహేందర్ పరామర్శించారు. మిగతా క్షతగాత్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.