News May 12, 2024

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయలేరు: మోదీ

image

మమతా బెనర్జీ పాలనలో చొరబాటుదారులు అభివృద్ధి చెందుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. బరాక్‌పూర్‌లో మాట్లాడుతూ.. ‘ఇక్కడి ప్రజలకు 5 గ్యారంటీలు ఇస్తున్నా. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు. SC, ST, OBC రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయలేరు. శ్రీరామ నవమి జరుపుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు కాదు. CAA అమలును ఎవరూ అడ్డుకోలేరు’ అని స్పష్టం చేశారు.

Similar News

News September 13, 2025

రేపే INDvsPAK.. మ్యాచ్ చూస్తారా?

image

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉంటే క్రేజే వేరు. కొందరైతే ఎంత ఖర్చయినా సరే విదేశాలకు వెళ్లి మ్యాచ్‌లు చూస్తుంటారు. కానీ పహల్గామ్ అటాక్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాయాదుల పోరుపై చాలామంది ఇంట్రెస్టే చూపట్లేదు. కొందరేమో మ్యాచ్‌ను మ్యాచ్‌లా చూడాలంటున్నారు. SMలో ఇంత రచ్చ అవుతున్నా BCCI & ప్లేయర్లు స్పందించలేదు. ఇంతకీ రేపు జరిగే మ్యాచ్‌ను మీరు వీక్షిస్తారా? బహిష్కరిస్తారా? కామెంట్ చేయండి.

News September 13, 2025

చైనాపై 50%-100% టారిఫ్స్ వేయండి: NATOకు ట్రంప్ లేఖ

image

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు చైనాపై 50%-100% టారిఫ్స్ విధించాలని <<7824953>>NATO<<>>కు ట్రంప్ లేఖ రాశారు. ‘NATO దేశాలు రష్యా ఆయిల్ కొనడం ఆశ్చర్యంగా ఉంది. అదే మిమ్మల్ని బలహీనం చేస్తోంది. దీనికి సరేనంటేనే నేను ముందుకెళ్తాను. బలమైన టారిఫ్స్‌తోనే చైనా, రష్యా బంధం బ్రేక్ అవుతుంది. అప్పుడే యుద్ధం ఆగుతుంది. లేదంటే US టైమ్, ఎనర్జీ, మనీ వృథా అవుతాయి’ అని స్పష్టం చేశారు. లేఖలో భారత ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

News September 13, 2025

కృష్ణా జలాల్లో 71% వాటా డిమాండ్ చేస్తున్నాం: ఉత్తమ్

image

TG: నదీ జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 811 TMCల కృష్ణా జలాల్లో 71% డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చుక్కనీటిని వదులుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కృష్ణా ట్రిబ్యునల్-2 సమావేశంలో బలంగా వాదిస్తామన్నారు. గత పాలకుల ఉదాసీనత వల్ల ఏపీ అక్రమంగా నీటిని తరలించుకొని ప్రయోజనం పొందిందని విమర్శించారు.