News May 12, 2024
చిత్తూరు: 3000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు

చిత్తూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 3000 పోలీస్ సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రామ, పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగంచుకునే విధంగా అన్ని రకాల భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. NCC, NSS, పదవి వివరణ చేసిన పోలీసులు, మాజీ సైనికులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.
Similar News
News January 12, 2026
చిత్తూరు జాయింట్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్ను నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన చిత్తూరుకు బదిలీ అయ్యారు. చిత్తూరులో JC విద్యాధరి విశాఖపట్నం జాయింట్ కలెక్టర్గా బదిలీ అయ్యారు.
News January 12, 2026
GDనెల్లూరు: CHC పూర్తయితే కష్టాలు తీరేనా.?

కార్వేటినగరం PHCలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్, హెల్త్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారు. 50 పడకల CHC పూర్తయితే సివిల్ సర్జన్లు, మెడికల్ ఆఫీసర్లు, గైనకాలజిస్ట్, పీడియాట్రీషియన్, అనస్థీషియా నిపుణులు అందుబాటులో ఉండనున్నారు. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, క్లాస్–4 సిబ్బంది అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు మెరుగుపడతాయని స్థానికులు అంటున్నారు.
News January 12, 2026
చిత్తూరు కలెక్టరేట్లో ప్రారంభమైన PGRS

చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార దిశగా సంబంధిత అధికారులకు ఫిర్యాదులపై బాధితుల ముందే పరిష్కరిస్తున్నారు. మండల స్థాయిలోనే ఫిర్యాదులు పరిష్కారం అవ్వాలని ఆదేశించారు. డీఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు.


