News May 12, 2024

మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి శివారులో ధాన్యం కుప్పల వద్ద పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు పాలంచ శ్రీ రాములు, విశాల్‌గా గుర్తించారు. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఒక్కసారి వాతావరణ మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Similar News

News January 12, 2026

మెదక్‌: పేకాట, కోడిపందాలపై కఠిన చర్యలు: ఎస్పీ

image

మెదక్ జిల్లా పరిధిలో పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పోలీస్ స్టేషన్‌ల పరిధిలో వాహన తనిఖీలు, రాత్రి, పగలు గస్తీ ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 11, 2026

మెదక్: వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన

image

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇప్పటివరకు 2490 దుప్పట్లను జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు కలెక్టర్‌కు అందజేశారు. దుప్పట్లను 17 బీసీ, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 1556 మంది విద్యార్థులకు, 6 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో 932 మంది విద్యార్థులకు అందజేశారు. గొప్పగా స్పందించి, పెద్ద ఎత్తున దుప్పట్లు అందించిన వారికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

News January 11, 2026

MDK: సంక్రాంతి వేళ అప్రమత్తత అవసరం: ఎస్పీ

image

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశమున్నందున నగదు, బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చోరీల నివారణకు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.