News May 12, 2024
జూన్ 4 తర్వాత మాఫియా రహిత రాష్ట్రంగా యూపీ: యోగీ

జూన్ 4 తర్వాత యూపీని మాఫియా రహిత రాష్ట్రంగా ప్రకటిస్తామని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. నేరస్థులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని పునరుద్ఘాటించారు. ‘కరుడుగట్టిన నేరగాళ్లు కూడబెట్టిన ఆస్తులు సీజ్ చేస్తాం. వీటిని అనాథలు, నిరుపేదలు, దివ్యాంగులు, సమాజంలో వెనుకబడిన వర్గాలకు పంపిణీ చేస్తాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
Similar News
News March 14, 2026
పుతిన్ ప్రపోజల్కు నో చెప్పిన ట్రంప్!

ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల (60% శుద్ధి చేసిన) యురేనియంను రష్యాకు తరలించాలని పుతిన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యుద్ధాన్ని ఆపేందుకు ఇది ఒక మార్గమని పుతిన్ చెప్పినట్లు తెలిపింది. ఈ యురేనియంతో సుమారు 11 అణు బాంబులను తయారు చేయవచ్చని సమాచారం. అందుకే ఈ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవాలి లేదా పనికిరాకుండా చేయాలని US ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
News March 14, 2026
రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించొద్దు: ఆకాశ్ చోప్రా

IPL-2026లో MI తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్గా కాకుండా పూర్తిస్థాయి ప్లేయర్గా ఆడించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. రోహిత్ ప్రస్తుతం గతంలో కంటే ఫిట్గా ఉన్నారని, ఆయన సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనుభవం ఉన్న లీడర్ మైదానంలో ఉంటే కెప్టెన్ హార్దిక్కు హెల్ప్ అవుతుందని అభిప్రాయపడ్డారు. గత సీజన్లో హిట్మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ మాత్రమే చేశారు.
News March 14, 2026
రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

భారత్లో ఈ ఫిబ్రవరిలో 4,17,705 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) వెల్లడించింది. 2025 FEBతో పోలిస్తే ఇది 10% అధికం. 2, 3 వీలర్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ గరిష్ఠాలను నమోదు చేశాయి. 2 వీలర్ సేల్స్(18,71,406) 35.2%, 3 వీలర్ సేల్స్(74,573) 29% పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల్లో మారుతి సుజుకి, 2 వీలర్లలో హీరో మోటోకార్ప్ టాప్లో నిలిచాయి.


