News May 12, 2024
ఆ టైమ్లో స్నేహితులెవరూ నాతో లేరు: మనీషా కోయిరాలా

తాను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు స్నేహితులు, దూరపు బంధువులు పట్టించుకోలేదని మనీషా కోయిరాలా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని నమ్మాను. పార్టీలు చేసుకోవడమే కాదు బాధలోనూ నాతో ఉంటారనుకున్నా. కానీ నాకు క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు నాతో ఎవరూ లేరు. దీంతో ఒంటరిగా ఫీలయ్యా. పేరెంట్స్, బ్రదర్ మాత్రమే నాకు అండగా నిలిచారు. వారే నా జీవితం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 16, 2026
TODAY HEADLINES

* TN, కేరళం, అస్సాం, W.బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికలకు మోగిన నగారా
* మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం: రేవంత్
* TG: ఈ నెల 22న రైతు భరోసా నిధుల విడుదల
* నన్ను డ్రగ్స్ కేసులోకి లాగితే లీగల్ యాక్షన్ తప్పదు: KTR
* నేను ఎలాంటి తప్పు చేయలేదు: పుట్టా మహేశ్
* పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం
* సినిమా నాకు అన్నం పెట్టింది: పవన్
* డ్రగ్స్ కేసు.. రోహిత్ రెడ్డికి 14రోజుల రిమాండ్
News March 16, 2026
ఆస్కార్స్లో మెరవనున్న భారతీయ అందం

లాస్ ఏంజెలిస్లో రేపు ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఇండియన్ టైమ్ ప్రకారం తెల్లవారుజామున 4.30 గంటలకు అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం మొదలవుతుంది. వేదికపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా సందడి చేయనున్నారు. పలువురు విజేతలకు ఆమె ఆస్కార్ అవార్డులు ప్రజెంట్ చేస్తారు. గతంలో ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చినప్పుడు దీపికా పదుకొణె అంతర్జాతీయ స్టేజీపై మెరిసిన విషయం తెలిసిందే.
News March 15, 2026
‘ఉస్తాద్’ అందుకే లేట్ అయింది: హరీశ్ శంకర్

కథ మారినందుకే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల ఆలస్యమైందని ప్రీరిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ హరీశ్ శంకర్ తెలిపారు. తొలుత అనుకున్న స్టోరీ సెట్ కాకపోవడంతో స్క్రిప్ట్ మార్చడం, కరోనా వంటి కారణాలతో లేట్ అయిందన్నారు. ఈ జర్నీలో ప్రొడ్యూసర్స్, పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇక మూవీ ఆలస్యంపై కొందరు కథలుకథలుగా మాట్లాడుకున్నారని, అది సృష్టి ధర్మమని హరీశ్ సెటైర్ వేశారు. ఈ సారి పండుగ ఉస్తాద్ ఉగాది అన్నారు.


