News May 12, 2024

రంగారెడ్డి: ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై నిఘా: కలెక్టర్

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు, రిటర్నింగ్ అధికారుల తనిఖీల్లో రంగారెడ్డి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జిల్లా వ్యాప్తంగా 1,534 కేసుల్లో రూ.49.72 కోట్లకు పైగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై నిఘా ఉంటుందని అన్నారు.

Similar News

News December 30, 2025

HYD: టూర్ ఇప్పుడెందుకు బాస్?

image

పదవి ఊడే టైంలో పిక్నిక్ ఏంటి సామీ.. FEBతో కాలపరిమితి ముగిసే GHMC కార్పొరేటర్లు ఇప్పుడు సడన్‌గా FEB 4th నుంచి 9th వరకు Study Tour చేస్తున్నారు. వీళ్లు వెళ్లి వచ్చేసరికి పదవి ఉండదు.. నేర్చుకున్నది అమలు చేసే టైమూ ఉండదు. మరి రూ.కోట్లాది ప్రజాధనం వృథా ఎవరి కోసం?. రిటైర్ అయ్యే ఉద్యోగులను కూడా ట్రైనింగ్‌కి పంపొద్దనే రూల్ ఉంది. ఈ ‘బైబై టూర్ల’కు బ్రేక్ వేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సర్కారును కోరింది.

News December 30, 2025

NEW YEAR: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో

image

న్యూ ఇయర్ వేళ నగరవాసులకు మెట్రో గుడ్ ‌న్యూస్ చెప్పింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రేపు 31ST నైట్ ఈవెంట్ల నేపథ్యంలో అర్ధరాత్రి కూడా మెట్రో రైల్ సేవలు అందించనుంది. జనవరి 1న అర్ధరాత్రి ఒంటి గంటకు చివరి రైలు ఉంటుంది. ఈ న్యూ ఇయర్‌కి జర్నీ స్ట్రెస్ లేకుండా సెలబ్రేషన్ చేసుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
SHARE IT

News December 30, 2025

HYD: టోల్‌ప్లాజాలు ఉండవిక.. RRRకు శాటిలైట్‌

image

హైవే మీద టోల్ కట్టడానికి కారు ఆపే రోజులకు ఇక చరమగీతం పాడబోతున్నారు. RRR వెంబడి ఎక్కడా మీకు టోల్ గేట్లు కనిపించవు. ఇది FREE అనుకుంటే పొరపాటే. కేంద్రం ఇక్కడ Global Navigation Satellite System శాటిలైట్ ట్రాకింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. రోడ్డు ఎక్కిన సెకను నుంచే ఆకాశంలో ఉన్న శాటిలైట్ మీ కారుని ఫాలో అవుతుంది. ప్రయాణించిన ప్రతి మీటరుకు లెక్క కట్టి, నేరుగా అకౌంట్ నుంచి పైసలు లాగేస్తుంది.