News May 12, 2024

రామభద్రపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

వ్యాన్ ఢీకొట్టి వ్యక్తి మృతి చెందిన ఘటన రామభద్రపురం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై జ్ఞాన ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చర్లవలస గ్రామానికి చెందిన బొడ్డు జగన్ మోహన్ రావు(48) బైక్‌పై వస్తుండగా, ఆరికతోట సమీపంలో నేషనల్ హైవేపై వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో జగన్ మోహన్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Similar News

News September 27, 2025

పైడిమాంబ సిరిమానోత్సవానికి సీఎంకు ఆహ్వానం

image

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అక్టోబర్ 6, 7 తేదీల్లో జరగనున్న సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ఆహ్వానం పలికారు. రాష్ట్ర పండగగా జరిగే శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎంను ఆహ్వానించినట్లు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.

News September 27, 2025

అక్టోబర్ 1న జిల్లాకు సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు అక్టోబర్ 1న జిల్లాలో పర్యటించనున్నారు. దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామాన్ని సందర్శించి పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జేసీ సేతుమాధవన్, డీఎస్పీ రాఘవులు, తదితరులు హెలీ ప్యాడ్, సభావేదికకు సంబందించి ఏర్పాట్లును శనివారం పరిశీలించారు. పర్యటనకు సంబందించి షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.

News September 27, 2025

విచారణ వేగవంతానికి ఈ-సమన్స్ అమలు చేయాలి: VZM SP

image

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో పని చేస్తున్న అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్
అధికారులు, హెచ్సీలతో SP దామోదర్ శనివారం జూమ్ మీటింగు నిర్వహించారు. నమోదైన కేసుల్లో నిందితులకు న్యాయ స్థానాల్లో శిక్షపడేలా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్ సిబ్బంది పాత్ర క్రియాశీలకమన్నారు. కేసుల విచారణ మరింత వేగవంతంగా జరిపించేందుకు ఈ-సమన్స్ అమలు చేయాలన్నారు.