News May 12, 2024
226 రూట్లు.. 385 బస్సులు: కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి

ఎన్నికల ప్రక్రియ కోసం సిబ్బందిని, సామగ్రిని తరలించడానికి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 226 రూట్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ రూట్లలో 120 ఆర్టీసీ బస్సులు, 265 మినీ బస్సులను వినియోగిస్తున్నామన్నారు. ఇవి కాకుండా ఎన్నికల అధికారులకు కార్లు, వ్యాన్లు తదితర ఇతర వాహనాలను సమకూర్చారు. మొత్తం 225 మంది సెక్టార్ అధికారులు ఈ రూట్లను పర్యవేక్షించనున్నట్ల తెలిపారు.
Similar News
News September 27, 2025
పైడిమాంబ సిరిమానోత్సవానికి సీఎంకు ఆహ్వానం

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అక్టోబర్ 6, 7 తేదీల్లో జరగనున్న సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ఆహ్వానం పలికారు. రాష్ట్ర పండగగా జరిగే శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎంను ఆహ్వానించినట్లు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.
News September 27, 2025
అక్టోబర్ 1న జిల్లాకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు అక్టోబర్ 1న జిల్లాలో పర్యటించనున్నారు. దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామాన్ని సందర్శించి పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జేసీ సేతుమాధవన్, డీఎస్పీ రాఘవులు, తదితరులు హెలీ ప్యాడ్, సభావేదికకు సంబందించి ఏర్పాట్లును శనివారం పరిశీలించారు. పర్యటనకు సంబందించి షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.
News September 27, 2025
విచారణ వేగవంతానికి ఈ-సమన్స్ అమలు చేయాలి: VZM SP

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్
అధికారులు, హెచ్సీలతో SP దామోదర్ శనివారం జూమ్ మీటింగు నిర్వహించారు. నమోదైన కేసుల్లో నిందితులకు న్యాయ స్థానాల్లో శిక్షపడేలా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్ సిబ్బంది పాత్ర క్రియాశీలకమన్నారు. కేసుల విచారణ మరింత వేగవంతంగా జరిపించేందుకు ఈ-సమన్స్ అమలు చేయాలన్నారు.