News May 12, 2024

226 రూట్లు.. 385 బ‌స్సులు: కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి

image

ఎన్నిక‌ల ప్ర‌క్రియ కోసం సిబ్బందిని, సామ‌గ్రిని త‌ర‌లించడానికి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 226 రూట్ల‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ రూట్ల‌లో 120 ఆర్టీసీ బ‌స్సులు, 265 మినీ బ‌స్సుల‌ను వినియోగిస్తున్నామన్నారు. ఇవి కాకుండా ఎన్నిక‌ల అధికారుల‌కు కార్లు, వ్యాన్‌లు త‌దిత‌ర‌ ఇత‌ర వాహ‌నాల‌ను స‌మ‌కూర్చారు. మొత్తం 225 మంది సెక్టార్ అధికారులు ఈ రూట్ల‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్నట్ల తెలిపారు.

Similar News

News March 15, 2026

VZM: జిల్లాలో 1,11,369 మంది అభ్యాసకులు అక్షరాంధ్ర పరీక్షకు హాజరు

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా అక్షరాంధ్ర పరీక్షను 1,277 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా 1,11,369 మంది అభ్యాసకులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత పరీక్ష పేపర్ మూల్యాంకనం చేసి ఫలితాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

News March 15, 2026

ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: VZM కలెక్టర్

image

రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత, వడగాలులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఎక్కువ సమయం పని చేయకుండా ఉండాలని, తరచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలని చెప్పారు. వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి చల్లబరచి అవసరమైతే సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

News March 14, 2026

పదో తరగతి కేంద్రాల వద్ద 144 సెక్షన్: VZM కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు మొత్తం 119 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, 564 మంది ప్రైవేట్ విద్యార్థులు, 631 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, ‘నో ఫోన్ జోన్’ అమల్లో ఉంటుంది. విద్యార్థులు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు.