News May 13, 2024

కౌంటింగ్ గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

image

నల్గొండ పట్టణ సమీపంలోని
అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకై ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చందన ఆదివారం తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు కు ఏర్పాటు చేసే టేబుళ్లు,బ్యారీకేడింగ్, ఏజెంట్లు బ్యారేడింగ్, భద్రత, తదితరాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు రెండు రోజుల ముందు అధికారులకు ఇక్కడ బస ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Similar News

News March 10, 2026

నల్గొండ: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 10, 2026

నల్గొండ: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 9, 2026

నల్గొండ: మార్చి 10 నుంచి పశువులకు టీకాలు

image

నల్గొండ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి (FMD) నివారణకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ జి.వి. రమేష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల పశువులకు టీకాలు వేసేందుకు 80 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామాల వారీగా జరిగే ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.