News May 13, 2024
దొంగ ఓటు వేయడానికి వెళ్తే కేసే!

ఎవరైనా ఓ వ్యక్తి దొంగ ఓటు వేయడానికి వచ్చారని పోలింగ్ ఏజెంట్లకు అనుమానం కలిగితే వారు ఆ వ్యక్తి గుర్తింపును సవాల్ చేస్తారు. ఇందుకోసం ప్రిసైడింగ్ అధికారికి రూ.2 డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. అనంతరం ఆ అధికారి విచారణ చేపడతారు. దొంగ ఓటు వేయడానికి వచ్చారని తేలితే సదరు వ్యక్తిని అక్కడున్న పోలీసులకు అప్పగించి, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు.
Similar News
News February 21, 2026
రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ రెండో వివాహం చేసుకున్నారు. ఐర్లాండ్కు చెందిన ప్రేయసి సోఫీ షైన్తో ఇవాళ ఏడడుగులు వేశారు. ఈ జంటకు అభిమానులు, తోటి క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
News February 21, 2026
667 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 21, 2026
ఆప్కోతో టీటీడీ ఒప్పందం.. భారీ ఆర్డర్

AP: ఆప్కో చరిత్రలోనే తొలిసారి TTD నుంచి ఆర్డర్ వచ్చింది. మొదటి విడతగా 3K కండువాలు, 5K దుశ్శాలువాలు, 90K కాటన్ అప్పర్లు, 75K కాటన్ బ్లౌజ్లు సరఫరా చేయాలని TTD కోరింది. వాటిపై ఓం నమో వేంకటేశాయ అని తెలుగు, సంస్కృతంలో ముద్రించాలని సూచించింది. ఈ ఆర్డర్ నేతన్నలకు వేంకన్న దీవెన వంటిదని మంత్రి సవిత పేర్కొన్నారు. వారికి 365 రోజుల పాటు ఉపాధి అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు పనిచేస్తున్నామన్నారు.


