News May 13, 2024
ఎన్నికల వేళ కరెంట్ కష్టాలు.. పోలింగ్కు ఇబ్బందులు!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో పవర్ కట్ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణలోని కొమురం భీం(D) ఆసిఫాబాద్లో పవర్ కట్ వల్ల ఇంకా పోలింగ్ ప్రారంభం కానట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి అక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. మరోవైపు ఏపీలోని అనంతపురం(D) రాయదుర్గంలో మాక్ పోలింగ్ నిలిచిపోయింది. భారీ వర్షం, పవర్ కట్తో పోలింగ్ సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు.
Similar News
News February 8, 2026
T20 WC: ఇంగ్లండ్ స్కోర్ 184-7

ముంబై: నేపాల్తో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 184-7 స్కోర్ చేసింది. జాకబ్ బెథెల్ (55), బ్రూక్ (53), విల్ జాక్స్ (39*) రాణించారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. షేర్ మల్లా, సందీప్ లామిచానే తలో వికెట్ పడగొట్టారు. కరణ్ కేసీ వేసిన చివరి ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. నేపాల్ టార్గెట్ 20 ఓవర్లలో 185 రన్స్.
News February 8, 2026
కేసీఆర్ ఫొటోకు అజహరుద్దీన్ దండం పెట్టాలి: హరీశ్ రావు

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తాము ప్రశ్నించినందుకే అజహరుద్దీన్కు సీఎం రేవంత్ మంత్రి పదవి ఇచ్చారని హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఫొటోకు అజహరుద్దీన్ దండం పెట్టాలని అన్నారు. ఆయనకు మంత్రి పదవి వచ్చి 3 నెలలైనా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని, ఇంకో 3 నెలల్లో ఇవ్వకపోతే మినిస్టర్ పదవి పోతుందని వ్యాఖ్యానించారు. తనకు వంద నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపనని స్పష్టం చేశారు.
News February 8, 2026
భారత్-పాక్ మ్యాచ్.. కాసేపట్లో నిర్ణయం!

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా టీమ్ ఇండియాతో తాము మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రధాని షరీఫ్ ప్రకటించారు. అయితే PCB మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఈనెల 15న కొలంబో వేదికగా భారత్తో జరగనున్న మ్యాచ్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ICC అఫీషియల్స్-PCB సభ్యులు భేటీకానున్నారు. ఈ సమావేశం ముగిశాక అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.


