News May 13, 2024
పల్నాడులో గొడవలపై ఈసీ ఆగ్రహం

AP: పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడు జిల్లాలో గొడవలు జరగడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా బయల్దేరారు. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని, అవసరమైతే అదనపు బలగాలను తరలించాలని అధికారులను ఈసీ ఆదేశించింది. రెంటచింతల మండల కేంద్రంలోని రెంటాలలో టీడీపీ, వైసీపీ వర్గాలు <<13236106>>ఘర్షణ<<>>కు దిగడంతో ఇద్దరు ఏజెంట్లకు గాయాలైన సంగతి తెలిసిందే.
Similar News
News February 11, 2026
కొత్త కార్పొరేషన్లతో కొత్త సమీకరణాలు

GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించడంతో కొత్త రాజకీయ సమీకరణాలు కన్పించబోతున్నాయి. కొత్త GHMCలో చాలా జోన్లలో AIMIM ఆధిపత్యం, సైబరాబాద్లో ఆంధ్రా వ్యాపారులు ప్రభావం చూపుతారని విశ్లేషకుల అంచనా. ఇక మల్కాజిగిరి కార్పొరేషన్లో WGL, కరీంనగర్, NLG, MDK సహా తెలంగాణ జిల్లాల ప్రజల ప్రాబల్యం కన్పిస్తుంది. దీంతో ఆయా కార్పొరేషన్ ఎన్నికల్లో ఇందుకు తగ్గట్లు పార్టీల, ప్రాంతాల కొత్త రాజకీయ శక్తులు, అవకాశాలు వస్తాయి.
News February 11, 2026
బ్లాక్ బీన్స్తో కలిగే హెల్త్ బెనిఫిట్స్ తెలుసా?

✦ ఫైబర్, పొటాషియం, ప్రొటెక్టివ్ యాంటీ ఆక్సిడెంట్లు గుండె హెల్త్ను కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు.
✦ రిచ్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయి.
✦ అధిక ఫైబర్, ప్రొటీన్లు ఆకలిని కంట్రోల్ చేస్తాయి. దీంతో హెల్తీగా బరువు తగ్గుతారు.
✦ యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.
✦ ప్రొటీన్లు బాడీలోని టిష్యూస్ను రిపేర్ చేస్తాయి.
✦ ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్ ఆరోగ్యంగా ఉంచుతాయి.
News February 11, 2026
T20WC: ఐర్లాండ్ ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ ఘోర ఓటమి చవిచూసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 16.5 ఓవర్లకు 115 రన్స్ చేసి ఆలౌట్ అయింది. డక్రెల్(41రన్స్) మినహా మిగతా బ్యాటర్లంతా తేలిపోవడంతో ఏ సమయంలోనూ గెలుపు వైపు పయనించలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్, జంపా తలో 4 వికెట్లు తీశారు. 3.5 ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసిన ఎల్లిస్కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డ్ దక్కింది.


