News May 13, 2024

లైన్‌లో నిల్చున్న పార్వతీపురం కలెక్టర్ దంపతులు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మాక్ పోలింగ్ అనంతరం ఈవీఎంలను చెక్ చేసి ఓటర్లను లోపలకు అనుమతించారు. పార్వతీపురం ప్రభుత్వ బ్రాంచ్ హైస్కూల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్, ఆయన సతీమణి లైన్‌లో నిల్చున్నారు. పార్వతీపురం మినహా కురుపాం, సాలూరు, పాలకొండ నియోజవకర్గాల్లో గంట ముందు పోలింగ్ ముగియనుంది.

Similar News

News March 11, 2026

దువ్వాడ-విశాఖ-విజయనగరం రైల్వే లైన్ అప్‌గ్రేడ్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని 106 కి.మీ.ల దువ్వాడ-విశాఖ-VZM సెక్షన్‌లో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ అప్‌గ్రేడ్‌కు రైల్వే శాఖ రూ.318.07 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 1×25 KV వ్యవస్థను ఆధునిక 2×25 KVగా మార్చనున్నారు. దీంతో విద్యుత్ సరఫరా పెరిగి రైళ్ల వేగం, సరకు రవాణా సామర్థ్యం మెరుగుపడనుంది. హౌరా-చెన్నై మార్గంలో ఉన్న ఈ సెక్షన్ ద్వారా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి ఖనిజాలు విశాఖ పోర్టుకు తరలిస్తారు.

News March 11, 2026

విజయనగరం: పోస్టల్ బీమాతో రూ.15 లక్షల ఆర్థిక సాయం

image

పోస్ట్ ఆఫీసు యాక్సిడెంటల్ పాలసీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని విజయనగరం పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసు అన్నారు. మంగళవారం దత్తిరాజేరులో ప్రమాదవశాత్తు మృతి చెందిన మర్రివలస గ్రామస్థుడు కోరాడ లక్ష్మణ్ రావు కుటుంబానికి రూ.15 లక్షల బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో గజపతినగరం పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర పాల్గొన్నారు. ఈ పాలసీని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అధికారులు కోరారు.

News March 10, 2026

విజయనగరం: గుండెపోటుతో ఆరోగ్యమిత్ర మృతి

image

విజయనగరంలో ఆరోగ్యమిత్రాగా పనిచేస్తున్న చింతల మహేశ్ (36) మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. కొత్తవలస గ్రామానికి చెందిన ఈయన గత 15 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ పథకంలో సేవలందిస్తున్నారు. మహేశ్ మరణంతో ఆయనపైనే ఆధారపడిన తల్లి, చెల్లి దిక్కులేనివారయ్యారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది మహేశ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.